పీవీ జ్ఞాన భూమిలోనే స్మారక చిహ్నం

ABN , First Publish Date - 2020-07-07T07:07:40+05:30 IST

పీవీ జ్ఞాన భూమిలోనే స్మారక చిహ్నం

పీవీ జ్ఞాన భూమిలోనే స్మారక చిహ్నం

హైదరాబాద్‌లోని పీవీ జ్ఞాన భూమిలోనే మాజీ ప్రధాని పీవీ నరసింహారావు స్మృత్యర్థం స్మారక చిహ్నాన్ని ఏర్పాటు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ విషయాన్ని పీవీ శత జయంతి ఉత్సవ కమిటీ చైర్మన్‌, టీఆర్‌ఎ్‌సపీపీ నేత కే.కేశవరావు తెలిపారు. సోమవారం ఇక్కడ కేకే నివాసంలో పీవీ శత జయంతి ఉత్సవ కమిటీ సభ్యులు సమావేశం అయ్యారు. స్మారక చిహ్నం నిర్మాణానికి సంబంధించి ఆర్కిటెక్చర్లు తాము రూపొందించిన నమూనాలను కమిటీ సభ్యులకు చూపించారు. మరో వారం రోజుల్లో కమిటీ మళ్లీ సమావేశం అవుతుందని, ఈ నెలాఖరులో పీవీ స్మారక చిహ్నం నమూనాను ఖరారు చేస్తామని చెప్పారు.

Updated Date - 2020-07-07T07:07:40+05:30 IST