వరల్డ్ చాంపియన్షిప్స్కు సింధు దూరం
ABN , First Publish Date - 2022-08-14T09:01:19+05:30 IST
ప్రతిష్ఠాత్మక వరల్డ్ చాంపియన్షిప్స్ నుంచి తెలుగు షట్లర్ పీవీ సింధు వైదొలగింది. ఎడమ పాదంలో స్ట్రెస్ ఫ్రాక్చర్ కావడంతో.
హైదరాబాద్ (ఆంధ్రజ్యోతి క్రీడాప్రతినిధి): ప్రతిష్ఠాత్మక వరల్డ్ చాంపియన్షిప్స్ నుంచి తెలుగు షట్లర్ పీవీ సింధు వైదొలగింది. ఎడమ పాదంలో స్ట్రెస్ ఫ్రాక్చర్ కావడంతో వైద్యుల సలహామేరకు కొన్ని వారాలు విశ్రాంతి తీసుకోనున్నట్టు ఆమె తెలిపింది. ‘బర్మింగ్హామ్ కామన్వెల్ క్రీడల్లో క్వార్టర్ ఫైనల్ ఆడు తుండగా గాయపడ్డా. అయితే, కోచ్, ఫిజియో, ట్రైనర్ ఇచ్చిన ప్రోత్సాహంతో ఫైనల్ వరకు ఆడగలిగా. ఫైనల్ జరుగుతున్న సమయంలో, ఆ తర్వాత భరించలేని నొప్పితో చాలా ఇబ్బంది పడ్డా. దాంతో హైదరాబాద్ రాగానే ఎంఆర్ఐ స్కాన్ తీయించగా వైద్యులు స్ట్రెస్ ఫ్రాక్చర్ను గుర్తించారు’ అని సింధు పేర్కొంది.