అమెరికాలో పీవీ విగ్రహ ప్రతిష్ఠాపనపై సమావేశం! పీవీ కమిటీ సభ్యుడు మహేష్ బిగాల హాజరు

ABN , First Publish Date - 2021-12-07T00:18:51+05:30 IST

అమెరికాలోని అట్లాంటాలో దివంగ‌త మాజీ ప్రధాని పి.వి.న‌ర‌సింహారావు విగ్రహం ఏర్పాటు చేస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో జరిగిన సన్నాహక సమేవేశానికి పీవీ శత జయంతి ఉత్సవ కమిటీ సభ్యుడు మ‌హేశ్ బిగాల హాజరయ్యారు.

అమెరికాలో పీవీ విగ్రహ ప్రతిష్ఠాపనపై సమావేశం! పీవీ కమిటీ సభ్యుడు మహేష్ బిగాల హాజరు

అమెరికాలోని అట్లాంటాలో దివంగ‌త మాజీ ప్రధాని పి.వి.న‌ర‌సింహారావు విగ్రహం ఏర్పాటు చేస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో జరిగిన సన్నాహక సమావేశానికి పీవీ శత జయంతి ఉత్సవ కమిటీ సభ్యుడు మ‌హేశ్ బిగాల హాజరయ్యారు. ఈ క్రమంలో అట్లాంటాలో రెండు మూడు ప్రదేశాలలో స్థల ప‌రిశీల‌న జరిగిందని,  పీవీ విగ్రహాన్ని వచ్చే వారంలో అమెరికాకు పంపే ఏర్పాట్లు జరుగుతన్నాయని ఆయన తెలిపారు. మొట్ట మొదటి విగ్రహం అట్లాంటాలో ఏర్పాటు చేస్తున్నందుకు అక్కడ వున్న అన్ని సంఘాల ప్రతినిధులు సంతోషం వ్యక్తం చేసారు. తెలంగాణా ప్రభుత్వానికి, ముఖ్యమంత్రి కెసిఆర్‌కు, పీవీ కమిటీ చైర్మన్ కేశవరావుకు, పీవీ కమిటీ సభ్యులు ఎన్నారై కన్వీనర్ మహేష్ బిగాలను అభినందించారు. అన్ని సంఘాలు కూడా ముందుకు వచ్చి పీవీ కార్యక్రమాలను పెద్ద ఎత్తున చేసేందుకు సహాయ సహకారాలు అందజేస్తామని ప్రతినిధులు ముక్త కంఠంతో చెప్పారు. 


ఈ సమావేశంలో మహేష్ బిగాల మాట్లాడుతూ ప్రస్తుత కరోనా పరిస్థితుల దృష్ట్యా ఏప్రిల్ నెలాఖరులో విగ్రహ ఆవిష్కారణ జరుగుతుందన్నారు.  త్వరలోనే విగ్రహా ఏర్పాటు తేదీకి సంబంధించిన వివరాలను తెలియజేస్తామన్నారు. ఆవిష్కరణ కార్యక్రమానికి తెలంగాణ నుంచి ప్రముఖుల్ని, పీవీ కుటుంబసభ్యుల‌ను ఆహ్వానిస్తున్నట్టు చెప్పారు. అమెరికాలోని తెలుగు, ఇండియన్ డియాస్పోరానే కాకుండా సెనెటర్, మిగ‌తా ప్రముఖులను ఆహ్వానిస్తున్నట్టు తెలిపారు. ఇటీవల పరమపదించిన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ మాజీ ముఖ్యమంత్రి కొణిజేటి రోశయ్యకు సభ్యులు నివాళులు అర్పించారు.


డా. పాడి శర్మ (IACA ఫౌండింగ్ మెంబర్) ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో మహేష్ బిగాలతో పాటు అక్కడి ప్రతినిధులు కిషన్ తాళ్లపల్లి గేట్స్ ప్రెసిడెంట్, వెంకట్ మీసాల తానా రీజియన్ కోఆర్డినేటర్, శ్రీధర్ కొంకల ఎన్నారై టీఆర్ఎస్ సభ్యుడు, నిరంజన్ పొద్దుటూరి ఎన్నారై TRS, జనార్దన్ పన్నెల గేట్స్ కార్యదర్శి,ఇన్నయ్య ఎనుముల తామా అధ్యక్షులు, రవి కల్లి తామా ఉపాధ్యక్షుడు,సాయిరాం కరమంచి తామా కార్యదర్శి, శివకుమార్ రామడుగు ఎన్నారై తెరాస, గణేష్ కసమ్ గేట్స్ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్, జయచంద్రారెడ్డి GATA బోర్డ్ ఆఫ్ డైరెక్టర్, సందీప్ గుండ్ల గేట్స్ సాంస్కృతిక కార్యదర్శి, వెంకట్ గడ్డం TTA బోర్డ్ ఆఫ్ డైరెక్టర్, శేఖర్ రెడ్డి పుట్టా TDF, అట్లాంటాకు చెందిన అజ్మీరీ ముస్తఫా, సాయిబాబా ఆర్కాట్ పాల్గొన్నారు.



Updated Date - 2021-12-07T00:18:51+05:30 IST