Eluru: నృసింహసాగర పుష్కరిణిలో కొండచిలువ మృతి
ABN , First Publish Date - 2022-07-15T14:15:59+05:30 IST
జిల్లాలోని ద్వారకాతిరుమల నృసింహ సాగర పుష్కరిణిలో కొండచిలువ మృతిచెందింది.
ఏలూరు: జిల్లాలోని ద్వారకాతిరుమల నృసింహ సాగర పుష్కరిణిలో కొండచిలువ మృతిచెందింది. పుష్కరిణిలో చేపల కోసం స్థానికులు వలపెట్టారు. ఈ క్రమంలో వలలో చిక్కుకున్న 8 అడుగుల కొండచిలువ ఊపిరాడక చనిపోయింది. అయితే నివాస ప్రాంతాల మధ్యకు కొండచిలువ రావడంతో స్థానికులు భయాందోళనకు గురవుతున్నారు.