జింకను మడిచి మింగేసిన కొండచిలువ... ఫొటో వైరల్!
ABN , First Publish Date - 2021-09-16T11:42:38+05:30 IST
రాజస్థాన్లోని బారాన్ జిల్లాలో ఒక భారీ కొండచిలువ...
బారాన్: రాజస్థాన్లోని బారాన్ జిల్లాలో ఒక భారీ కొండచిలువ ఒక జింకను మింగుతున్న ఉదంతానికి సంబంధించిన వీడియో వైరల్గా మారింది. ఈ వీడియోలో ఒక పెద్ద కొండచిలువ తన నోటిని పూర్తి స్థాయిలో తెరిచి జింకను మింగుతున్న దృశ్యం కనిపిస్తుంది.
ఈ ఘటన బారాన్ జిల్లా కిషన్గంజ్ అటవీక్షేత్రంలో జరిగింది. అక్కడి లాలాపురా ప్లాంటేషన్లో జింకను మింగుతున్న కొండచిలువ కనిపించింది. అటవీశాఖ అధికారులు చూస్తుండగానే ఆ కొండచిలువ జింకను పూర్తిగా మింగేసిన ఘటన జరిగింది. అటవీక్షేత్రంలో విధులు నిర్వహిస్తున్న అధికారి పురుషోత్తమ్... కొండచిలువ జింకను మింగుతుండటాన్ని చూశారు. దీనిని తన మొబైల్ ఫోనులో వీడియో తీశారు. ఈ విషయాన్ని ఆయన పైఅధికారులకు తెలియజేశారు. వారంతా అక్కడకు చేరుకునేసరికి ఆ కొండచిలువ... జింకను పూర్తిగా మింగేసింది. ఈ ఉదంతానికి సంబంధించిన ఫొటో వైరల్గా మారింది. కాగా ఈ అటవీక్షేత్రంలో జింకలు, కొండచిలువలు, ఎలుగుబంట్లతో పాటు ఇతర అటవీజంతువులు ఉన్నాయి.