రోడ్డు నిర్మాణ పనుల తనిఖీ

ABN , First Publish Date - 2022-05-19T06:41:38+05:30 IST

నూజివీడు–విజయవాడ రోడ్డు నిర్మాణ పనులను బుధవారం ఆర్‌ అండ్‌ బీ క్వాలిటీ కంట్రోల్‌ అధికారులు తనిఖీ చేశారు.

రోడ్డు నిర్మాణ పనుల తనిఖీ
రోడ్డు మందాన్ని తనిఖీ చేస్తున్న క్వాలిటీ కంట్రోల్‌ అధికారులు

ఆగిరిపల్లి, మే 18 : నూజివీడు–విజయవాడ రోడ్డు నిర్మాణ పనులను బుధవారం ఆర్‌ అండ్‌ బీ క్వాలిటీ కంట్రోల్‌ అధికారులు తనిఖీ  చేశారు. రూ.32 కోట్ల వ్యయంతో రెండేళ్లుగా ఈ పనులు జరుగుతున్నాయి.  10 మీట ర్లకు ఈ రోడ్డును విస్తరిచడంతో పాటు పలు ప్రాంతాల్లో కల్వర్టు నిర్మాణం చేస్తున్నారు. ఆర్‌ అండ్‌ బి చీఫ్‌ ఇంజినీర్‌ వెంకటేశ్వరరావు నేతృత్వంలో క్వాలిటీ  కంట్రోల్‌ ఎస్‌ఈ జాన్‌మోషె, డీఈ సాంబశివరావు, ఈఈ, జేఈలు  పలు ప్రాంతాలలో రోడ్డును తవ్వించి  నాణ్యతను పరిశీలించారు.  కల్వర్టుల నాణ్యతను కూడా తనిఖీ చేశారు. రోడ్డు విస్తరణ పనులు దాదాపు పూర్తికావచ్చినందున వెంటనే బీటీ పనులు కూడా ప్రారంభించాలని ఆదేశించారు. ఆర్‌ అండ్‌  బీ ఏఈ అశోక్‌బాబు తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2022-05-19T06:41:38+05:30 IST