నాణ్యమైన మందులను విక్రయించాలి
ABN , First Publish Date - 2022-06-24T05:30:00+05:30 IST
నాణ్యమైన మందులను విక్రయించాలి
మొయినాబాద్ రూరల్, జూన్ 24: మెడికల్ షాపుల్లో నాణ్యమైన మందులను విక్రయించాలని ఎమ్మెల్యే కాలె యాదయ్య అన్నారు. వర్షకాలం రావడంతో ప్రజలు వివిద రోగాల బారిన పడే అవకాశం ఉన్నందున మెడికల షాపుల్లో నాణ్యమైన మందులును విక్రయించాలని చేవెళ్ల ఎమ్మెల్యే కాలే యాదయ్య తెలిపారు. శుక్రవారం మండల పరిధిలోని బాకారం గ్రామంలో హిమయత్ నగర్ గ్రామానికి చెందిన వడ్ల హరిశంకర్ చారి నూతనంగా ఏర్పాటు చేసిన మెడికల్ షాపున ఆయన ముఖ్యఅతిథిగా పాల్గోని ప్రారంభించారు. యువత చెడు అలవాట్లకు దూరంగా ఉండి స్వయం ఉపాధివైపు వెళ్లి ఆర్థికంగా ఎదగాలని సూచించారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ కొత్తపల్లి రాఘవరెడ్డి, మాజీ సర్పంచ్ సుదాకర్ యాదవ్, వార్డు సభ్యుడు కొత్తపల్లి తిరుపతి రెడ్డి, మహేందర్ ఉన్నారు.