ఏపీని ప్రశ్నిస్తాం: షెకావత్
ABN , First Publish Date - 2022-03-05T03:07:04+05:30 IST
కేంద్ర జల్జీవన్ మిషన్ పథకం ఏపీలో సరిగా అమలు కావడం లేదని తప్పుబట్టారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ
అమరావతి: కేంద్ర జల్జీవన్ మిషన్ పథకం ఏపీలో సరిగా అమలు కావడం లేదని తప్పుబట్టారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ ఈ పథకం కింద ఏపీకి రూ.7 వేల కోట్లు కేంద్రం కేటాయించిందని తెలిపారు. దీనిలో కేంద్రం వాటా రూ.3,800 కోట్లన్నారు. ఇప్పటివరకు జల్జీవన్ కింద ఏపీ రూ.190 కోట్లు మాత్రమే ఖర్చు చేసిందని తెలిపారు. ఏపీలో 20 శాతం మాత్రమే జల్జీవన్ పథకాన్ని అమలు చేస్తున్నారని పేర్కొన్నారు. ఈ పథకాన్ని ఏపీ ప్రభుత్వం ఎందుకు పట్టించుకోవడం లేదు? అని ప్రశ్నించారు. దక్షిణాది రాష్ట్రాల సదస్సులో ఈ అంశంపై ఏపీని ప్రశ్నిస్తామని షెకావత్ చెప్పారు.