త్వరితగతిన నాడు-నేడు పనులు పూర్తి చేయాలి

ABN , First Publish Date - 2021-03-02T06:19:39+05:30 IST

రాష్ట్రప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న నాడు-నేడు పనులను త్వరితగతిన పూర్తిచేయాలని ఐటీడీఏ పీఓ డాక్టర్‌ వెంకటేశ్వర్‌ ఇంజనీరింగ్‌ అధికారులు,హెచ్‌లను ఆదేశించారు

త్వరితగతిన నాడు-నేడు పనులు పూర్తి చేయాలి
యండపల్లివలస కేజీబీవీ పాఠశాలలో నాడు-నేడు పనులను పరిశీలిస్తున్న ఐటీడీఏ పీఓ వెంకటేశ్వర్‌


ఐటీడీఏ పీఓ వెంకటేశ్వరన్‌

అరకులోయ, మార్చి 1: రాష్ట్రప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న నాడు-నేడు పనులను త్వరితగతిన పూర్తిచేయాలని ఐటీడీఏ పీఓ డాక్టర్‌ వెంకటేశ్వర్‌ ఇంజనీరింగ్‌ అధికారులు,హెచ్‌లను ఆదేశించారు. సోమవారం   యండపల్లివలస కేజీబీవీలో నాడు-నేడు పనులను టీడబ్ల్యూ ఈఈ శ్రీనివాసరావుతో కలిసి పీవో పరిశీలించారు. మురుగుకాల్వలు, డైనింగ్‌హల్‌ ఫ్లోరింగ్‌, టాయ్‌లెట్స్‌, మైదానం చదును పనులను పరిశీలించారు. పాఠశాలలో జరుగుతున్న పనుల వివరాలను హెచ్‌ఎం, వెంకటలక్ష్మీ, టీడబ్ల్యూ ఏఈఈ అభిషేక్‌ లు పీఓకు వివరించారు. పూర్తికాని పనులు త్వరితగతిన పూర్తిచేయాలని, నిర్దిష్ట గడువులోగా అన్ని పనులు పూర్తి చేసేలా చర్యలు చేపట్టాలని ఇంజనీరింగ్‌ అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో ఏటీడబ్ల్యుఓ మల్లికార్జునరావు, తదితరులు పాల్గొన్నారు. 

Updated Date - 2021-03-02T06:19:39+05:30 IST