స్పందన దరఖాస్తులకు సత్వర పరిష్కారం : ఆర్డీవో
ABN , First Publish Date - 2022-06-28T05:43:49+05:30 IST
స్పందనలో వచ్చిన దరఖాస్తులను సత్వరం పరిష్కరిస్తున్నట్టు ఆర్డీవో గోవిందరావు అన్నారు.
నర్సీపట్నం అర్బన్ , జూన్ 27: స్పందనలో వచ్చిన దరఖాస్తులను సత్వరం పరిష్కరిస్తున్నట్టు ఆర్డీవో గోవిందరావు అన్నారు. సోమవారం తన కార్యాలయంలో ప్రజల నుంచి వచ్చిన వినతులను ఆయన స్వీకరించారు. స్పందనలో 33 దరఖాస్తులు వచ్చాయని, మునిసిపల్ కమిషనర్పై అట్రాసిటీ కేసు నమోదు చేసి, తక్షణం అరెస్ట్ చేయాలని అనకాపల్లి జిల్లా దళిత సంఘాల ఐక్యవేదిక నాయకుడు నేతల నాగేశ్వరరావు, కె.మరిడయ్య, యర్రశెట్టి పాపారావులు ఫిర్యాదు చేశారన్నారు. అలాగే భూ ఆక్రమణలు తొలగించాలని దరఖాస్తులు అందాయని తెలిపారు.