రాజీవ్‌ సేవలు అభినందనీయం

ABN , First Publish Date - 2022-05-22T03:19:42+05:30 IST

మాజీ ప్రధాని స్వర్గీయ రాజీవ్‌గాంధీ దేశానికి చేసిన సేవలు ఎంతో అభినందనీ యమని నియోజకవర్గ కాంగ్రెస్‌ ఇన్‌చా

రాజీవ్‌ సేవలు అభినందనీయం
ఉదయగిరి : రాజీవ్‌ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పిస్తున్న నాయకులు

ఉదయగిరి రూరల్‌, మే 21: మాజీ ప్రధాని స్వర్గీయ రాజీవ్‌గాంధీ దేశానికి చేసిన సేవలు ఎంతో అభినందనీ యమని నియోజకవర్గ కాంగ్రెస్‌  ఇన్‌చార్జి దుద్దుకూరు రమేష్‌నాయుడు అన్నారు. శనివారం స్థానిక తహసీల్దారు కార్యాలయ ఆవరణలో రాజీవ్‌ వర్థంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి  నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీపీ బాలయ్య, నాయకులు హజరత్‌, వెంగయ్య, రమణయ్య, ధోనిశ్రీకర్‌ తదితరులు పాల్గొన్నారు. 


 జలదంకిలో..


జలదంకి :  యువతకు 18 ఏళ్లకే ఓటుహక్కు కల్పించిన మహోన్నత వ్యక్తి రాజీవ్‌గాంధీ అని కాంగ్రెస్‌ సీనియర్‌ నాయకుడు వేలమూరి శివశేఖర్‌రెడ్డి పేర్కొన్నారు.  శనివారం జలదంకి బస్టాండు కూడలిలో రాజీవ్‌గాంధీ వర్ధంతి సందర్భంగా శనివారం ఆయన నివాళులు అర్పించారు. ఈ  కార్యక్రమంలో రాఘవరెడ్డి, మాలకొండయ్య తదితరులు పాల్గొన్నారు.




Updated Date - 2022-05-22T03:19:42+05:30 IST