IPL 2022: రబడ విజృంభణ.. గుజరాత్ను ఆదుకున్న Sai Sudharsan
ABN , First Publish Date - 2022-05-04T03:01:10+05:30 IST
పంజాబ్ కింగ్స్తో జరుగుతున్న మ్యాచ్లో గుజరాత్ టైటాన్స్ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 143 పరుగులు
ముంబై: పంజాబ్ కింగ్స్తో జరుగుతున్న మ్యాచ్లో గుజరాత్ టైటాన్స్ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 143 పరుగులు చేసింది. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న Gujarat Titans ఈ మ్యాచ్లో తడబడింది. Punjab Kings బౌలర్ల దెబ్బకు.. ముఖ్యంగా కగిసో రబడ పదునైన బంతులను ఎదుర్కోలేని బ్యాటర్లు వికెట్లు సమర్పించుకుని పెవిలియన్కు క్యూకట్టారు.
వృద్ధిమాన్ సాహా 21, డేవిడ్ మిల్లర్ 11, రాహుల్ తెవాటియా 11 పరుగులు చేశారు. ఆరుగురు ఆటగాళ్లు సింగిల్ డిజిట్ దాటలేకపోయారు. అయితే, సాయిసుదర్శన్ క్రీజులోకి పాతుకుపోవడంతో జట్టు గౌరప్రదమైన స్కోరు చేయగలిగింది. 50 బంతులు ఎదుర్కొన్న సుదర్శన్ 5 పోర్లు, సిక్సర్తో 64 పరుగులు చేసి టాప్ స్కోరర్గా నిలిచాడు. పంజాబ్ బౌలర్లలో Kagiso Rabada 4 వికెట్లు తీసుకోగా అర్షదీప్ సింగ్, రిషి ధవన్, లియామ్ లివింగ్స్టోన్, చెరో వికెట్ తీసుకున్నారు.