కుందేళ్ల ద్వీపం!
ABN , First Publish Date - 2021-01-06T05:30:00+05:30 IST
ఒకప్పుడు సైనికుల స్థావరం అది. విషపూరిత రసాయనాల తయారీ కోసం ఆ ద్వీపాన్ని ఉపయోగించారు. కానీ ఇప్పుడు అది పర్యాటక ప్రదేశం.
ఒకప్పుడు సైనికుల స్థావరం అది. విషపూరిత రసాయనాల తయారీ కోసం ఆ ద్వీపాన్ని ఉపయోగించారు. కానీ ఇప్పుడు అది పర్యాటక ప్రదేశం. ఆ ద్వీపంలో ఎటుచూసినా కుందేళ్లు కనిపిస్తాయి. అందుకే ఆ ద్వీపానికి ‘ర్యాబిట్ ఐలాండ్’ అని పేరు.
జపాన్లో హిరోషిమా, షికొకు నగరాల మధ్య ఈ చిన్న ద్వీపం ఉంటుంది. రెండో ప్రపంచయుద్ధ సమయంలో ఈ ద్వీపం కీలకపాత్ర పోషించింది. విషపూరిత రసాయనాల తయారీని జపాన్ సైన్యం ఇక్కడే చేసింది.
ఇప్పుడు గోల్ఫ్కోర్సులు, రిసార్టులు, పార్కులు, బీచ్లతో పర్యాటకులను విశేషంగా ఆకర్షిస్తోంది. పర్యాటకులు ఈ దీవిని సందర్శించడానికి ప్రధాన కారణం ఇక్కడ ఉండే కుందేళ్లు. వాటితో ఫొటోలు దిగడానికి, వాటిని కెమెరాల్లో బంధించడానికి పర్యాటకులు ఆసక్తి చూపుతుంటారు.
ఈ దీవిలో ఒక్క కుక్క కూడా కనిపించదు. అందుకే కుందేళ్లు స్వేచ్ఛగా తిరుగుతుంటాయి. పర్యాటకులుగా ఇక్కడికి వచ్చే వాళ్లు కూడా కుక్కలు తీసుకురావడం నిషేధం.