‘ఊళ్లకు వెళ్లే వారు జాగ్రత్త’... పోస్టర్ విడుదల చేసిన రాచకొండ సీపీ

ABN , First Publish Date - 2022-01-10T17:10:36+05:30 IST

సంక్రాంతి పండుగ సందర్భంగా తమ తమ సొంత ఊళ్లకు వెళ్లే వారు జాగ్రత్తగా ఉండాలంటూ రాచకొండ సీపీ మహేష్ భగవత్ సోమవారం పోస్టర్ విడుదల చేశారు.

‘ఊళ్లకు వెళ్లే వారు జాగ్రత్త’... పోస్టర్ విడుదల చేసిన రాచకొండ సీపీ

హైదరాబాద్: సంక్రాంతి పండుగ సందర్భంగా తమ తమ సొంత ఊళ్లకు వెళ్లే వారు జాగ్రత్తగా ఉండాలంటూ రాచకొండ సీపీ మహేష్ భగవత్ సోమవారం పోస్టర్ విడుదల చేశారు. సంక్రాంతి పండుగను టార్గెట్‌గా చేసుకొని దొంగలు అలజడి సృష్టియించే అవకాశం ఉందన్నారు. ‘‘మీ ఇంట్లో విలువైన బంగారం, వెండి ఇంట్లో పెట్టకూడదు. ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో అవగాహన కల్పిస్తున్నాం’’ అని తెలిపారు. ఊరు వెళ్తున్నట్లు సోషియల్ మీడియా ఎవరు కుడా పెట్టొద్దన్నారు. దొంగలు కూడా సోషియల్ మీడియాను బలంగా వాడుతున్నారని రాచకొండ సీపీ మహేష్ భగవత్ అన్నారు. 

Updated Date - 2022-01-10T17:10:36+05:30 IST