ఎస్వీ వేద వర్సిటీ రిజిస్ర్టార్‌గా రాధేశ్యామ్‌

ABN , First Publish Date - 2022-05-23T06:46:00+05:30 IST

తిరుపతిలోని ఎస్వీ వేద విశ్వవిద్యాలయ రిజిస్ర్టార్‌(ఎ్‌ఫఏసీ)గా రీసెర్చ్‌ అండ్‌ పబ్లికేషన్స్‌ విభాగ డిప్యూటీ డైరెక్టర్‌గా పనిచేసే డాక్టర్‌ ఏవీ రాధేశ్యామ్‌ను నియమించారు.

ఎస్వీ వేద వర్సిటీ రిజిస్ర్టార్‌గా రాధేశ్యామ్‌
రాధేశ్యామ్‌, ఫణి యజ్ఞేశ్వరయాజులను అభినందిస్తున్న అధ్యాపకులు

తిరుపతి(విద్య), మే 22: తిరుపతిలోని ఎస్వీ వేద విశ్వవిద్యాలయ రిజిస్ర్టార్‌(ఎ్‌ఫఏసీ)గా రీసెర్చ్‌ అండ్‌ పబ్లికేషన్స్‌ విభాగ డిప్యూటీ డైరెక్టర్‌గా పనిచేసే డాక్టర్‌ ఏవీ రాధేశ్యామ్‌ను నియమించారు. గతంలో వేదవిభాగ ప్రొఫెసర్‌ తారక రామకుమారశర్మ ఇన్‌చార్జి రిజిస్ర్టార్‌గా వ్యవహరించిన విషయం తెలిసిందే. అలాగే ఇన్‌చార్జి డీన్‌గా పౌరోహిత్యం విభాగ ప్రొఫెసర్‌ డాక్టర్‌ ఫణి యజ్ఞేశ్వరయాజులు నియమితులయ్యారు. ఇంతకుముందు డీన్‌గా పనిచేసిన ప్రొఫెసర్‌ గోలి సుబ్రహ్మణ్యశర్మ మూడేళ్ల పదవీకాలం ముగియడంతో ఈయనకు బాధ్యతలు అప్పగించారు. ఈ మేరకు టీటీడీ ఈవో ధర్మారెడ్డి శనివారం సాయంత్రం నియామక ఉత్తర్వులు వెలువరించారు. కాగా.. రాధేశ్యామ్‌, ఫణి యజ్ఞేశ్వరయాజులను ఆదివారం పలువురు అధ్యాపకులు, సిబ్బంది మర్యాదపూర్వకంగా కలసి అభినందించారు.

Updated Date - 2022-05-23T06:46:00+05:30 IST