ఉపాధ్యాయులు ఉప్పెనలా ఉద్యమిస్తున్నారు: ఎంపీ రఘురామ

ABN , First Publish Date - 2022-02-09T20:58:17+05:30 IST

ఉపాధ్యాయులు ఉప్పెనలా ఉద్యమిస్తున్నారని నరసాపురం ఎంపీ రఘురామ కృష్ణంరాజు అన్నారు.

ఉపాధ్యాయులు ఉప్పెనలా ఉద్యమిస్తున్నారు: ఎంపీ రఘురామ

న్యూఢిల్లీ: ఉపాధ్యాయులు ఉప్పెనలా ఉద్యమిస్తున్నారని నరసాపురం ఎంపీ రఘురామ కృష్ణంరాజు అన్నారు. బుధవారం ఆయన ఇక్కడ మీడియాతో మాట్లాడుతూ గతంలో కలెక్టరేట్ల ముట్టడిలో కూడా ఉపాధ్యాయులు ముందుకు వచ్చారని, టీచర్స్‌ను అరెస్ట్ చేశారు కానీ నలుగురు ఉద్యోగ సంఘాల నాయకులను మాత్రం అరెస్ట్ చేయలేదని విమర్శించారు. ఆశితోష్ మిశ్రా నివేదిక ఇవ్వలేదు... దగా కోరు నాయకులను పక్కన పెట్టి ఉపాధ్యాయులు ఉద్యమం చేస్తున్నారన్నారు.


1 లక్ష 98 వేల ఉద్యోగాలు ఇచ్చామని సీఎం జగన్ చెబుతున్నారని, ఆర్టీసీ కార్మికులకు ఉద్యోగులు ఇచ్చాం అంటున్నారు.. అవసరం లేని ఉద్యోగాలు సృష్టించారని రఘురామ విమర్శించారు. 62 ఏళ్లు అవసరం లేదు.. 60 ఏళ్లు సరిపోతుందంటూ ఉద్యోగులు ఛీ కొడుతున్నారన్నారు. ఆందోళన చేస్తున్న ఉపాధ్యాయులను వైసీపీ కార్యకర్తలు భయబ్రాంతులకు గురి చేస్తున్నారని, ఇది మంచిది కాదని టీచర్స్ అంటున్నారన్నారు. ఉద్యోగులకు చేసిన వాగ్ధానాలు నిలబెట్టుకోవాలని రఘురామ సూచించారు.

Updated Date - 2022-02-09T20:58:17+05:30 IST