వైసీపీ తీరుపై రఘురామ అభ్యంతరం

ABN , First Publish Date - 2022-04-16T21:52:32+05:30 IST

వైసీపీ తీరుపై ఎంపీ రఘురామకృష్ణరాజు అభ్యంతరం తెలిపారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ రేషన్ బియ్యానికి నగదు బదిలీతో ఇబ్బందులు

వైసీపీ తీరుపై రఘురామ అభ్యంతరం

ఢిల్లీ: వైసీపీ తీరుపై ఎంపీ రఘురామకృష్ణరాజు అభ్యంతరం తెలిపారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ రేషన్ బియ్యానికి నగదు బదిలీతో ఇబ్బందులు పెడుతున్నారని మండిపడ్డారు. బియ్యాన్ని విదేశాలకు ఎగుమతి చేసే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. కాకినాడ పోర్టు నుంచి విదేశాలకు బియ్యం స్మగ్లింగ్  చేస్తున్నారని ఆరోపించారు. పేద ప్రజల ఆహార భద్రత దెబ్బతింటుందని ఆందోళన వ్యక్తం చేశారు. పైలట్ ప్రాజెక్టు పేరుతో మోసగిస్తున్నారని రఘురామకృష్ణరాజు మండిపడ్డారు.

Updated Date - 2022-04-16T21:52:32+05:30 IST