లబ్ధిదారులకు CM Relief Fund చెక్కులు పంపిణీ చేసిన రఘునందన్ రావు

ABN , First Publish Date - 2022-05-31T19:32:54+05:30 IST

రఘునందన్ రావు దుబ్బాక క్యాంపు కార్యాలయంలో 44 మంది లబ్ధిదారులకు సిఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు పంపిణీ చేశారు.

లబ్ధిదారులకు CM Relief Fund చెక్కులు పంపిణీ చేసిన రఘునందన్ రావు

Siddhipet: బీజేపీ (BJP) ఎమ్మెల్యే రఘునందన్ రావు (Raghunandan Rao) మంగళవారం దుబ్బాక క్యాంపు కార్యాలయంలో 44 మంది లబ్ధిదారులకు సిఎం రిలీఫ్ ఫండ్ (CM Relief Fund) చెక్కులు పంపిణీ చేశారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ టిఆర్ఎస్ ప్రభుత్వం (TRS Govt.) ఎనిమిదేళ్లుగా రైతులను పట్టించుకున్న పాపాన పోలేదని విమర్శించారు. ఇవాళ వ్యవసాయ శాఖ మంత్రి గజ్వేల్ మీటింగ్‌కు రోడ్డుపై వస్తే రైతుల కష్టాలు తెలుస్తాయని, హెలికాప్టర్ మీద రావడం విడ్డూరంగా ఉందన్నారు. గాలి మాటలు చెప్పేందుకే గాలిమోటర్ మీద వస్తుండ్రని, మంత్రికి చిత్తశుద్ధి ఉంటే రోడ్డుపై వడ్లను చూసి ఏం చేయాలో ఆలోచన చేయాలన్నారు. వాకిట్లో వడ్లు తడుస్తుంటే.. వార్షాకాలం వరి కోసం రాష్ట్ర ప్రభుత్వం ఆలోచన చేస్తోందని విమర్శించారు. జూన్ ఒకటి నుంచి పది వరకు వ్యవసాయ అధికారులను గ్రామాల్లో క్షేత్ర స్థాయిలో పరిశీలన చేయించాలని రఘునందన్ రావు మంత్రికి సూచించారు.

Updated Date - 2022-05-31T19:32:54+05:30 IST