ఏళ్ల కొద్దీ ఏలుతున్న పార్టీల పునాదులు కదులుతున్నాయి: Raghunandan

ABN , First Publish Date - 2022-06-25T17:12:42+05:30 IST

సిద్దిపేట రూరల్ మండలం రాఘవాపూర్, బచ్చాయిపల్లిలో బీజేపీ(BJP) జెండాను ఆవిష్కరించి పెద్దమ్మతల్లి దేవాలయంలో..

ఏళ్ల కొద్దీ ఏలుతున్న పార్టీల పునాదులు కదులుతున్నాయి: Raghunandan

Siddipet : సిద్దిపేట రూరల్ మండలం రాఘవాపూర్, బచ్చాయిపల్లిలో బీజేపీ(BJP) జెండాను ఆవిష్కరించి పెద్దమ్మతల్లి దేవాలయంలో దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్ రావు(Raghunandan Rao) ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం రఘు నందన్‌రావు మీడియాతో మాట్లాడుతూ.. ఏళ్ల కొద్దీ ఏలుతున్న పార్టీల పునాదులు కదులుతున్నాయని ఎద్దేవా చేశారు. ‘8 ఏళ్లలో బచ్చాయిపల్లికి ఇచ్చిన ఉద్యోగాలు ఎన్ని? డబుల్ బెడ్ రూంలు ఎన్ని వేశారు? సీసీ రోడ్లు ఎన్ని? పరిపాలించే నాయకులే చెప్పాలి’ అన్నారు. రాష్ట్రంలో కాషాయం జెండా ఎగురయడం ఖాయమన్నారు. మీకు చిత్త శుద్ధి ఉంటే బచ్చాయిపల్లికి వెంటనే డబుల్ బెడ్రూం ఇవ్వాలని డిమాండ్ చేశారు. ప్రజల గుండెల్లో కాషాయం జెండా ఉన్నదని.. ఫ్లెక్సీలలో మాత్రం మీ బొమ్మలున్నాయని టీఆర్ఎస్‌నుద్దేశించి రఘునందన్ పేర్కొన్నారు.

Updated Date - 2022-06-25T17:12:42+05:30 IST