బొత్సపై రఘురామ ప్రశంసలు

ABN , First Publish Date - 2022-04-13T20:59:52+05:30 IST

మంత్రి బొత్స సత్యనారాయణపై ఎంపీ రఘురామకృష్ణరాజు ప్రశంసలు కురిపించారు. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ ప్రమాణస్వీకారంలో బొత్స హుందాగా వ్యవహరించారని తెలిపారు

బొత్సపై రఘురామ ప్రశంసలు

ఢిల్లీ: మంత్రి బొత్స సత్యనారాయణపై ఎంపీ రఘురామకృష్ణరాజు ప్రశంసలు కురిపించారు. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ ప్రమాణస్వీకారంలో బొత్స హుందాగా వ్యవహరించారని తెలిపారు. మిగతా వాళ్లు జగన్‌ కాళ్లు పట్టుకోవడమేంటి? అని ప్రశ్నించారు. 70 శాతం బీసీ, ఎస్టీలకు ఇచ్చారని అంటున్నారని, సకలశాఖ మంత్రి సజ్జలనే అన్ని చూసుకుంటారని విమర్శించారు. దమ్మిడీ ఆదాయం లేని కార్పొరేషన్లకు చైర్మన్‌లా? అని ప్రశ్నించారు. బ్రాహ్మణులు, క్షత్రియులకు మంత్రి పదవి ఇవ్వలేదని తప్పుబట్టారు. తిరుపతికి సీఎం జగన్ ఇచ్చే గౌరవం ఇదేనా అని నిలదీశారు. ఫుల్ టైం టీటీడీ ఈవో నియామకం చేపట్టాలని డిమాండ్ చేశారు. తిరుమల వెళ్లే భక్తుల్లో అభద్రతా భావం నెలకొందని ఆందోళన వ్యక్తం చేశారు. జనసేన అధినేత పవన్ కల్యాణ్‌ని చాలా మంది చూసి నేర్చుకోవాలని రఘురామకృష్ణరాజు సూచించారు.

Updated Date - 2022-04-13T20:59:52+05:30 IST