రోడ్ల దుస్థితిపై ఆనాడు జగన్ బాగానే చెప్పారు: రఘురామ
ABN , First Publish Date - 2021-08-24T21:27:35+05:30 IST
రాష్ట్రంలో రోడ్ల దుస్థితిపై ఎన్నికల ప్రచారంలో జగన్ బాగా చెప్పారని రఘురామ అన్నారు.
న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రోడ్ల దుస్థితిపై ఎన్నికల ప్రచారంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి చాలా బాగా చెప్పారని రఘురామ కృష్ణం రాజు అన్నారు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ ఆనాడు జగన్ పశ్చిమగోదావరి జిల్లాలో పర్యటిస్తున్నప్పుడు రోడ్లు బాగోలేవని విమర్శించారన్నారు. ఈ సందర్భంగా ఆనాడు జగన్ మాట్లాడిన వీడియోను రఘురామ మీడియాకు చూపించారు. అయితే వైఎస్సార్సీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత రోడ్లే లేవని ఎద్దేవా చేశారు. ఉపాధిహామీ నిధులను కేంద్రం ఇచ్చినా రాష్ట్రంలో బిల్లులు చెల్లించడంలేదన్నారు.