సీఎం కడిగిన ముత్యంలా బయటకు రావాలి: రఘురామ
ABN , First Publish Date - 2021-08-24T21:45:17+05:30 IST
అక్రమాస్తుల కేసులో జగన్ కడిగిన ముత్యంలా బయటకు రావాలని రఘురామ కోరుకుంటున్నానన్నారు.
న్యూఢిల్లీ: అక్రమాస్తుల కేసులో ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కడిగిన ముత్యంలా బయటకు రావాలని కోరుకుంటున్నారని ఎంపీ రఘురామ కృష్ణంరాజు అన్నారు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ ఏడాదిన్నర నుంచి స్టేలు తెచ్చుకుంటున్నారని, వాయిదా వేసేందుకు న్యాయమూర్తికి విచక్షణాధికారం ఉంటుందన్నారు. ఈనెల 25న కోర్టు తీర్పు ఉన్న నేపథ్యంలో దీనిపై ముందుగా మాట్లాడటం సరికాదని రఘురామ వ్యాఖ్యానించారు.