AP News: హెల్త్ వర్సిటీ పేరు మార్పుపై స్పందించిన ఎంపీ రఘురామ

ABN , First Publish Date - 2022-09-21T21:05:56+05:30 IST

ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ పేరు మార్పుపై ఎంపీ రఘురామ కృష్ణంరాజు స్పందించారు.

AP News: హెల్త్ వర్సిటీ పేరు మార్పుపై స్పందించిన ఎంపీ రఘురామ

ఢిల్లీ (Delhi): ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ (NTR Health University) పేరు మార్పుపై ఎంపీ రఘురామ కృష్ణంరాజు (MP Raghurama) స్పందించారు. బుధవారం ఆయన ఇక్కడ మీడియాతో మాట్లాడుతూ ఎన్టీఆర్ హెల్త్ వర్సిటీకి పేరు ఎందుకు మార్చాల్సి వచ్చిందని ప్రశ్నించారు. పథకాలకు ప్రభుత్వం పెడుతున్న పేర్లు వింటేనే ప్రజలకు అసహ్యం వేస్తోందన్నారు. వైఎస్ రాజశేఖర్‌రెడ్డికి.. వాహన మిత్రకు సంబంధం ఏంటన్నారు. పేరు మార్పు నిర్ణయంతో పార్టీ తుడుచుకుపోయే ప్రమాదం ఉందన్నారు. పేరు మార్పు నిర్ణయాన్ని ప్రభుత్వం వెనక్కి తీసుకోవాలని సీఎం జగన్‌కు సూచించారు.


ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీని 1986 స్థాపించారని రఘురామ అన్నారు. చంద్రబాబు ఒకటి అరా తప్ప ఎప్పుడు ఆయన పేరు పెట్టుకోలేదన్నారు. కాంగ్రెస్ పార్టీని తిట్టి, జగన్ బయటకు వచ్చారన్నారు. రాజశేఖర్ రెడ్డి బ్రతికి ఉంటే కాంగ్రెస్ వదిలి వెళ్ళేవారు కాదన్నారు. తెలుగు వాడికి గౌరవం తీసుకొచ్చిన ఎన్టీఆర్ పేరునే తీసేశారని ఆవేదన వ్యక్తం చేశారు. రాజశేఖర్ రెడ్డి కూడా ఎన్టీఆర్‌కు గౌరవం ఇచ్చేవారని రఘురామ అన్నారు.

Updated Date - 2022-09-21T21:05:56+05:30 IST