Raghurama: మూడు రాజధానులు ఏంటి? అని వైసీపీ నేతలే అంటున్నారు..

ABN , First Publish Date - 2022-09-12T21:10:37+05:30 IST

సినీ నటుడు, రెబల్ స్టార్ కృష్ణంరాజు కు ఎంపీ రఘురామ కృష్ణంరాజు అశ్రునివాళులర్పించారు.

Raghurama: మూడు రాజధానులు ఏంటి? అని వైసీపీ నేతలే అంటున్నారు..

ఢిల్లీ (Delhi): సినీ నటుడు, రెబల్ స్టార్ కృష్ణంరాజు (Krishnamraju)కు ఎంపీ రఘురామ కృష్ణంరాజు (Raghurama Krishnam Raju)  అశ్రునివాళులర్పించారు. సోమవారం ఆయన ఇక్కడ మీడియాతో మాట్లాడుతూ అమరావతి టూ అరసవిల్లి వరకు రైతుల మహాపాదయాత్ర (Maha Padayatra) మొదలైందన్నారు. అమరావతి రైతుల పోరాటం వెయ్యి రోజులు పూర్తి చేసుకుందన్నారు. త్వరలో అసెంబ్లీలో మూడు రాజధానుల బిల్లు పెడతారని తెలిసిందని, మూడు రాజధానులు ఏంటి? అని వైసీపీ నేతలే అంటున్నారన్నారు. మంత్రులతో తిట్టించడాన్ని ప్రజలు అసహించుకుంటున్నారని.. సభ్యసమాజం హర్షించదన్నారు. ఇప్పటికైనా అనుచిత వ్యాఖ్యలు చేయడం, బూతుల యుద్ధానికి తెరదించాలని  రఘురామ కృష్ణంరాజు సూచించారు.

Updated Date - 2022-09-12T21:10:37+05:30 IST