రోడ్డు మార్గాన వస్తే అడ్డుకునే అవకాశం ఉండడంతో...: ఎంపీ రాఘురామ
ABN , First Publish Date - 2022-07-02T23:30:34+05:30 IST
రోడ్డు మార్గాన వస్తే అడ్డుకునే అవకాశం ఉండడంతో...: ఎంపీ రాఘురామ
హైదరాబాద్: ప్రధాని పర్యటనలో పాల్గొనేందుకు హెలికాప్టర్ కోసం అనుమతివ్వాలని ఎంపీ రఘురామ రాజు హైకోర్టులో హౌస్ మోషన్ పిటిషన్ దాఖలు చేశారు. రోడ్డు మార్గాన వస్తే అడ్డుకునే అవకాశం ఉండడంతో హెలికాప్టర్లో వచ్చేందుకు అనుమతి ఇవ్వాలని రఘురామకృష్ణరాజు హైకోర్టును కోరారు. హెలికాప్టర్ ల్యాండింగ్ అనుమతి ఇవ్వాలంటూ లాయర్ ఉమేష్చంద్ర పిటిషన్ దాఖలు చేశారు. హౌస్మోషన్ పిటిషన్ విచారణకు ఏపీ హైకోర్టు అనుమతించింది.