Jagan అవినీతి రుజువైతే పార్టీకి ఇబ్బందులు తప్పవు: రఘురామ
ABN , First Publish Date - 2022-07-08T01:17:52+05:30 IST
సీఎం జగన్ అవినీతి రుజువైతే పార్టీకి ఇబ్బందులు తప్పవని ఎంపీ రఘురామకృష్ణరాజు (MP Raghu ramakrishna Raju) హెచ్చరించారు
ఢిల్లీ: సీఎం జగన్ అవినీతి రుజువైతే పార్టీకి ఇబ్బందులు తప్పవని ఎంపీ రఘురామకృష్ణరాజు (MP Raghu ramakrishna Raju) హెచ్చరించారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ వైసీపీ ఎమ్మెల్యేలు బీజేపీ (BJP)లోకి వెళ్లే అవకాశం ఉందని జోస్యం చెప్పారు. ఎన్నికల రూల్ ప్రకారం ఒకే పార్టీలో సభ్యులుగా ఉండాలని, ఒకేసారి రెండు పార్టీల్లో ఎవరూ సభ్యులుగా ఉండకూడదన్నారు. షర్మిల (Sharmila) పార్టీలో విజయమ్మ సభ్యులుగా ఉన్నరో లేదో తెలియదని చెప్పారు. విజయమ్మను రాజీనామా చేయాలనడం తమ పార్టీకి దెబ్బనని పేర్కొన్నారు. విజయమ్మను ఎందుకు వద్దనుకుంటున్నారో ఆలోచించడం కష్టమేనని చెప్పారు. రాజీనామా కోరుతూ లేఖ పంపడం అమ్మలందరికీ బాధాకరమన్నారు. జగన్ వల్ల తల్లి, చెల్లికి అన్యాయం జరిగిందని తెలిపారు. తల్లి, చెల్లిని దూరం పెట్టినవాడు మనల్నేం చూస్తాడని, రాష్ట్ర ఆడబిడ్డలు భావిస్తున్నారని రఘురామకృష్ణరాజు పేర్కొన్నారు.