రఘురామిరెడ్డి అంత్యక్రియలు
ABN , First Publish Date - 2021-07-24T06:02:32+05:30 IST
కర్నూలు మాజీ మేయర్ రఘురామిరెడ్డి (93) అంత్యక్రియలు ఆయన స్వగ్రామమైన మీదివేములలో శుక్రవారం నిర్వహించారు. ఆయన్ను చివరి సారిగా చూసేందుకు జనం భారీగా తరలి వచ్చారు
ఓర్వకల్లు, జూలై 23: కర్నూలు మాజీ మేయర్ రఘురామిరెడ్డి (93) అంత్యక్రియలు ఆయన స్వగ్రామమైన మీదివేములలో శుక్రవారం నిర్వహించారు. ఆయన్ను చివరి సారిగా చూసేందుకు జనం భారీగా తరలి వచ్చారు. కేంద్ర మాజీ మంత్రి కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి, పాణ్యం ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్రెడ్డి, నంద్యాల లోక్సభ టీడీపీ అధ్యక్షుడు గౌరు వెంకటరెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు గౌరు చరిత, కోట్ల సుజాతమ్మ, మదనగోపాల్, మణిగాంధీ, గడ్డం ప్రకాష్ రెడ్డి తదితరులు ఆయన భౌతికకాయానికి పూలమాలలు వేసి నివాళి అర్పించారు.