కాశీవిశ్వనాథ గుడిలో పూజలు చేసిన రాహుల్, ప్రియాంక

ABN , First Publish Date - 2022-03-05T00:35:30+05:30 IST

కాంగ్రెస్ పార్టీ కీలక నేతలు రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ వాద్రా వారణాసిలోని కాశీవిశ్వనాథ ఆలయంలో శుక్రవారం పూజలు నిర్వహించారు. ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా వారణాసికి ప్రచారానికి వచ్చిన వీరిద్దరూ.. కాంగ్రెస్ పార్టీ..

కాశీవిశ్వనాథ గుడిలో పూజలు చేసిన రాహుల్, ప్రియాంక

లఖ్‌నవూ: కాంగ్రెస్ పార్టీ కీలక నేతలు రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ వాద్రా వారణాసిలోని కాశీవిశ్వనాథ ఆలయంలో శుక్రవారం పూజలు నిర్వహించారు. ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా వారణాసికి ప్రచారానికి వచ్చిన వీరిద్దరూ.. కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించిన ఎన్నికల ర్యాలీలో పాల్గొనే ముందు కాశీవిశ్వనాథుడిని దర్శించుకున్నారు. ఈ సందర్బంగా ప్రియాంక గాంధీ వాద్రా మాట్లాడుతూ ‘‘అన్నయ్య (రాహుల్ గాంధీ), నేను ఎప్పుడూ ఇక్కడికి వస్తుంటాం. కాశీ విశ్వనాథుడిని దర్శించుకుని, బాబా ఆశీస్సులు తీసుకుంటాము’’ అని అన్నారు. ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు చివరి అంకానికి వచ్చాయి. ఏడు విడతల పోలింగ్‌లో ఆరు విడతల పోలింగ్ ఇప్పటికే ముగిసింది. చివరి విడత పోలింగ్ మార్చి 7న జరగనుంది. అనంతరం మార్చి 10న ఫలితాలు విడుదల కానున్నాయి.

Updated Date - 2022-03-05T00:35:30+05:30 IST