Kashmir అధికారానికి నిచ్చెనలా మారింది: Rahul Gandhi
ABN , First Publish Date - 2022-06-02T22:31:43+05:30 IST
భారతీయ జనతా పార్టీ(Bharatiya Janata Party)కి జమ్మూ కశ్మీర్(Jammu and Kashmir) అధికారానికి నిచ్చెనలా మారిందని కాంగ్రెస్ కీలక నేత రాహుల్ గాంధీ(Rahul Gandhi) విమర్శలు గుప్పించారు. కశ్మీర్లో ఈరోజు ఒక బ్యాంక్ మేనేజర్ చనిపోవడంపై ఆయన స్పందిస్తూ బీజేపీపై, మోదీ ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు..
శ్రీనగర్: భారతీయ జనతా పార్టీ(Bharatiya Janata Party)కి జమ్మూ కశ్మీర్(Jammu and Kashmir) అధికారానికి నిచ్చెనలా మారిందని కాంగ్రెస్ కీలక నేత రాహుల్ గాంధీ(Rahul Gandhi) విమర్శలు గుప్పించారు. కశ్మీర్లో ఈరోజు ఒక బ్యాంక్ మేనేజర్ చనిపోవడంపై ఆయన స్పందిస్తూ బీజేపీపై, మోదీ ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. కశ్మీర్ను కాపాడాల్సిన వారు సినిమా ప్రమోషన్లలో బిజీగా ఉన్నారంటూ రాహుల్ వ్యాఖ్యానించారు. గురువారం తన ట్విట్టర్ ఖాతా ద్వారా రాహుల్ స్పందిస్తూ ‘‘బ్యాంక్ మేనేజర్, టీచర్ ఇలా ఎంతో మంది అమాయకులు ప్రతిరోజు బలి అవుతున్నారు. కశ్మీరీ పండిట్లు పారిపోతున్నారు. వారిని కాపాడాల్సిన వారు సినిమా ప్రమోషన్లకే టైం సరిపోకుండా ఉన్నారు. బీజేపీకి కశ్మీర్ కేవలం అధికారం ఎక్కడానికి ఉపయోగపడే నిచ్చెనలా మారోపోయింది. ప్రధాని.. కశ్మీర్లో శాంతి పునరుద్ధరణకు తక్షణ చర్యలు తీసుకోండి’’ అని ట్వీట్ చేశారు.