శ్రీలంక టూర్‌కు హెడ్‌కోచ్‌గా రాహుల్‌ ద్రవిడ్‌?

ABN , First Publish Date - 2021-05-11T18:52:41+05:30 IST

జులై నెలలో శ్రీలంకలో పర్యటించనున్న భారత జట్టుకు దిగ్గజ క్రికెటర్ రాహుల్ ద్రవిడ్ హెడ్ కోచ్‌గా వ్యవహరించనున్నారా?

శ్రీలంక టూర్‌కు హెడ్‌కోచ్‌గా రాహుల్‌ ద్రవిడ్‌?

జులై నెలలో శ్రీలంకలో పర్యటించనున్న భారత జట్టుకు దిగ్గజ క్రికెటర్ రాహుల్ ద్రవిడ్ హెడ్ కోచ్‌గా వ్యవహరించనున్నారా? అవుననే అంటున్నాయి బీసీసీఐ వర్గాలు. ఇంగ్లండ్‌లో వరల్డ్‌ టెస్ట్‌ ఛాంపియన్‌షిప్‌ ఫైనల్, ఐదు టెస్ట్‌లు సిరీస్ కోసం కోహ్లీ సేన ఈ నెల 29న ఇంగ్లండ్‌కు పయనమవనుంది. అదే సమయంలో శ్రీలంకతో 3 వన్డేలు, 3 టీ20 మ్యాచ్‌లను టీమిండియా ఆడాల్సి ఉంది. ఇంగ్లండ్ పర్యటనకు ఎంపిక కాని ఆటగాళ్లు శ్రీలంక టూర్‌కు వెళ్లనున్నారు. 


టీమిండియా ప్రధాన కోచ్ రవిశాస్త్రి.. కోహ్లీ సేనతోపాటు ఇంగ్లండ్ వెళుతున్న నేపథ్యంలో శ్రీలంక టూర్‌కు కోచింగ్ బాధ్యతలను దిగ్గజ క్రికెటర్ రాహుల్ ద్రవిడ్‌కు అప్పగించాలని బీసీసీఐ భావిస్తున్నట్టు తెలుస్తోంది. ద్రవిడ్‌తోపాటు పాటు నేషనల్‌ క్రికెట్‌ అకాడమీకి సంబంధించిన సిబ్బంది కూడా శ్రీలంక టూర్‌కు వెళ్లనున్నట్లు తెలుస్తోంది. శ్రీలంక, భారత్ మధ్య జూలై 13, 16, 19 తేదీల్లో వన్డేలు... జూలై 22, 24, 27 తేదీల్లో టీ20 మ్యాచ్‌లు జరుగనున్నాయి. 

Updated Date - 2021-05-11T18:52:41+05:30 IST