ద్రవిడ్ టీమిండియా చీఫ్ కోచ్ పదవి వద్దన్నాడు: ఆసక్తికర విషయాన్ని వెల్లడించిన వినోద్ రాయ్

ABN , First Publish Date - 2020-07-07T00:14:00+05:30 IST

టీమిండియా మాజీ క్రికెటర్ రాహుల్ ద్రవిడ్‌కు చీఫ్ కోచ్ పదవి ఆఫర్ చేస్తే అతడు సున్నితంగా తిరస్కరించినట్టు కమిటీ

ద్రవిడ్ టీమిండియా చీఫ్ కోచ్ పదవి వద్దన్నాడు: ఆసక్తికర విషయాన్ని వెల్లడించిన వినోద్ రాయ్

ముంబై: టీమిండియా మాజీ క్రికెటర్ రాహుల్ ద్రవిడ్‌కు చీఫ్ కోచ్ పదవి ఆఫర్ చేస్తే అతడు సున్నితంగా తిరస్కరించినట్టు కమిటీ ఆఫ్ అడ్మినిస్ట్రేటర్స్ (సీవోఏ) మాజీ చీఫ్ వినోద్ రాయ్ వెల్లడించారు. తను అండర్-19 కోచ్‌గానే ఉంటానని, తన కుటుంబం కోసం సమయాన్ని వెచ్చిస్తానని చెబుతూ కోచ్ పదవిని తిరస్కరించినట్టు తెలిపారు. ‘‘చూడండి.. ఇంట్లో ఇద్దరు పిల్లలు పెరుగుతున్నారు. భారతజట్టుతో కలిసి ప్రపంచమంతా తిరిగాను. కాబట్టి నేను పిల్లల విషయంలో శ్రద్ధ చూపించలేకపోతున్నాను. నేనిప్పుడు ఇంట్లోనే ఉండి వారికి సమయం కేటాయించాలనుకుంటున్నాను’’ అని ద్రవిడ్ తమతో చెప్పినట్టు రాయ్ ఓ ఇంటర్వ్యూలో పేర్కొన్నారు.


కోచింగ్ సామర్థ్యం పరంగా చూస్తే ద్రవిడ్, రవిశాస్త్రి, కుంబ్లేలు బెస్ట్ అని రాయ్ చెప్పుకొచ్చారు. తాము కచ్చితంగా రాహుల్‌తో మాట్లాడామని, అతడు అండర్-19 జట్టుతో కలిసిపోయాడని రాయ్ తెలిపారు. జట్టును ఎలా తీర్చిదిద్దాలనే విషయంలో అతడు రోడ్ మ్యాప్‌ను తయారు చేశాడని రాయ్ పేర్కొన్నారు.  అతడు అద్భుతమైన ఫలితాలు తీసుకొస్తున్నాడని, ద్రవిడ్ చేయాల్సిన పని ఇంకేదో మిగిలి ఉందని, అది పూర్తిచేయాలని అతడు భావిస్తున్నాడని రాయ్ వివరించచారు.   

Updated Date - 2020-07-07T00:14:00+05:30 IST