Bharat Jodo Yatra : చైనా ఆక్రమించుకున్న భూమిపై రాహుల్ గాంధీ సూటి ప్రశ్న

ABN , First Publish Date - 2022-09-14T22:54:18+05:30 IST

ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ (Narendra Modi) నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం

Bharat Jodo Yatra : చైనా ఆక్రమించుకున్న భూమిపై రాహుల్ గాంధీ సూటి ప్రశ్న

తిరువనంతపురం : ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ (Narendra Modi) నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం దాదాపు 1,000 చదరపు కిలోమీటర్ల భారత భూభాగాన్ని చైనా (China)కు ఇచ్చిందని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ (Rahul Gandhi) ఆరోపించారు. ఎటువంటి పోరాటం లేకుండానే ఇచ్చేసిన ఈ భూమిని తిరిగి ఎలా స్వాధీనం చేసుకుంటారో చెప్పాలని డిమాండ్ చేశారు. 


2020 ఏప్రిల్‌నాటికి ఉన్న స్థితిని పునరుద్ధరించాలని భారత దేశం చేసిన డిమాండ్‌ను చైనా తిరస్కరించిందని చెప్పారు. ఎంత భూభాగాన్ని తిరిగి స్వాధీనం చేసుకుంటారో ప్రభుత్వం చెప్పగలదా? అని బుధవారం ఇచ్చిన ట్వీట్‌లో ప్రశ్నించారు. 


రాహుల్ గాంధీ బుధవారం నాలుగో రోజు భారత్ జోడో యాత్రలో పాల్గొన్నారు. అంతకుముందు కేరళలోని శివగిరి మఠాన్ని సందర్శించి, సంఘ సంస్కర్త శ్రీ నారాయణ గురుకు పూజలు చేశారు. మఠంలోని స్వామీజీలతో మాట్లాడారు. 


నవైకులం కూడలి నుంచి బుధవారం ఉదయం 7.30 గంటలకు నాలుగో రోజు భారత్ జోడో యాత్రను రాహుల్ ప్రారంభించారు. 


Updated Date - 2022-09-14T22:54:18+05:30 IST