రాహుల్ చాలు..కాంగ్రెస్‌ను ముంచడానికి : శివరాజ్ సింగ్

ABN , First Publish Date - 2021-09-30T00:33:04+05:30 IST

కాంగ్రెస్‌ పార్టీని నిండా ముంచడానికి రాహుల్ గాంధీ ఒక్కరు చాలని మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి..

రాహుల్ చాలు..కాంగ్రెస్‌ను ముంచడానికి : శివరాజ్ సింగ్

న్యూఢిల్లీ: కాంగ్రెస్‌ పార్టీని నిండా ముంచడానికి రాహుల్ గాంధీ ఒక్కరు చాలని మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ అన్నారు. వయనాడ్ ఎంపీ (రాహుల్) ఉన్నంత కాలం కాంగ్రెస్ పార్టీని ముంచడానికి బీజేపీ ఏమీ చేయాల్సిన పని లేదని పేర్కొన్నారు. పంజాబ్‌ కాంగ్రెస్, ఆ పార్టీ ప్రభుత్వంలో చోటు చేసుకున్న తాజా పరిణామాలపై మాట్లాడుతూ, పటిష్టంగా ఉన్న పంజాబ్ ప్రభుత్వానికి రాహుల్ గాంధీ చెల్లుచీటి చెప్పారని, సిద్ధూ కారణంగానే కెప్టెన్ అమరీందర్‌ను సీఎం పదవి నుంచి తప్పించారని అన్నారు. ఇప్పుడు సిద్ధూ కూడా పలాయనం చిత్తగిస్తున్నారని, రాహుల్ గాంధీ ఉన్నంత కాలం తాము (బీజేపీ) చేయాల్సినదేమీ లేదని శివరాజ్ సింగ్ చమత్కరించారు.


కాగా, సిద్ధూ రాజీనామాను కాంగ్రెస్ అధిష్ఠానం వెంటనే ఆమోదించకుండా బుధవారం రాత్రి వరకూ పునరాలోచించుకునే అవకాశం ఇచ్చింది. అప్పటికీ సిద్ధూ ఒక నిర్ణయానికి రానిపక్షంలో సిద్ధూ స్థానంలో పీపీసీసీ చీఫ్‌ పగ్గాలు మరొకరికి అప్పగించే అవకాశాలున్నాయని, కెప్టెన్‌కు సన్నిహితుడైన సునీల్ జాఖడ్‌కు పార్టీ చీఫ్ పగ్గాలు ఇవ్వొచ్చని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.

Updated Date - 2021-09-30T00:33:04+05:30 IST