ఆ కార్యక్రమానికి Rahul రాక అనుమానమే...

ABN , First Publish Date - 2022-07-09T17:38:07+05:30 IST

ప్రతిపక్షనేత సిద్దరామయ్య 75వ జన్మదినాన్ని పుర స్కరించుకుని నిర్వహిస్తున్న ‘సిద్దరామోత్సవ’ కార్యక్రమంలో కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌గాంధీ

ఆ కార్యక్రమానికి Rahul రాక అనుమానమే...

బెంగళూరు, జూలై 8 (ఆంధ్రజ్యోతి): ప్రతిపక్షనేత సిద్దరామయ్య 75వ జన్మదినాన్ని పుర స్కరించుకుని నిర్వహిస్తున్న ‘సిద్దరామోత్సవ’ కార్యక్రమంలో కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌గాంధీ పాల్గొనడం అనుమానమే అనిపిస్తోంది. ఇటీవల సిద్దరామయ్య ఢిల్లీ వెళ్లిన సందర్భంలో రాహుల్‌గాంధీని స్వయంగా ఆహ్వానించారు. దావణగెరెలో ఆగస్టు 3న జరిగే సిద్దరామోత్సవ కార్యక్రమానికి హాజరవుతానని హామీ ఇచ్చారు. ఈమేరకు రాహుల్‌ కార్యాలయం నుంచి కూడా ఆయన పర్యటన ఉంటుందని ఖరారు చేశాయి. అందుకు అనుగుణంగానే రాష్ట్ర కాంగ్రెస్‌ పార్టీ రాహుల్‌గాంధీని ఆహ్వానించడంతోపాటు బెంగళూరు నుంచి దావణగెరెకు తీసుకెళ్లేందుకు ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు. తాజాగా శుక్రవారం రాహుల్‌గాంధీ ‘సిద్ద రామోత్సవ’లో పాల్గొనడం అనుమానమేనని తేల్చాయి. ఈనెల 31న ఈడీ విచారణకు హాజరు కావాలని ఏఐసీసీ అధ్యక్షురాలు సోనియా గాంధీకి సమన్లు జారీ చేశారు. విచారణ ఆగస్టు 3వరకు కొనసాగే అవకాశం ఉంది. తల్లితోపాటు ఈడీ కార్యాలయానికి రాహుల్‌ కూడా వెళ్లను న్నారు. ఇలా దావణగెరె కార్యక్రమానికి రాహుల్‌గాంధీ హాజరు కాలేరని ఆయన కార్యాలయ వర్గాలు సమాచారాన్ని అందించాయి. 

Updated Date - 2022-07-09T17:38:07+05:30 IST