అనుమతి నిరాకరించినా లఖింపూర్‌కు రాహుల్

ABN , First Publish Date - 2021-10-06T16:21:59+05:30 IST

హింసాత్మక ఘటనలు చోటుచేసుకున్న ఉత్తరప్రదేశ్‌లోని లఖింపూర్ జిల్లాలో కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ బుధవారం..

అనుమతి నిరాకరించినా లఖింపూర్‌కు రాహుల్

లక్నో: హింసాత్మక ఘటనలు చోటుచేసుకున్న ఉత్తరప్రదేశ్‌లోని లఖింపూర్ జిల్లాలో కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ బుధవారం మధ్యాహ్నం పర్యటించనున్నారు. రైతులకు సంఘీభావం తెలిపేందుకు ఐదుగురు సభ్యుల ప్రతినిధి బృందంతో రాహుల్ వస్తున్నందున ఆయనను అనుమతించాలంటూ కాంగ్రెస్ పార్టీ ఇప్పటికే ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వానికి లేఖ రాసింది. అయితే, నిషేధాజ్ఞల పేరుతో యూపీ ప్రభుత్వం అనుమతి నిరాకరించింది. ఈ నేపథ్యంలో రాహుల్ యథాప్రకారం లఖింపూర్‌ జిల్లాలో తన పర్యటన సాగించనున్నారు. రాహుల్  ప్రతినిధి బృందంలో ఛత్తీస్‌గఢ్ ముఖ్యమంత్రి భూపేష్ బఘెల్, పంజాబ్ ముఖ్యమంత్రి చరణ్‌జిత్ చన్ని, పార్టీ నేత కేసీ వేణుగోపాల్, రాజస్థాన్ ఉప ముఖ్యమంత్రి సచిన్ పైలట్ ఉంటారని, వీరంతా మధ్యాహ్నం 1.30 గంటలకు లక్నో చేరుకుంటారని పార్టీ వర్గాలు తెలిపాయి.

Updated Date - 2021-10-06T16:21:59+05:30 IST