Sidhu Moosewala కుటుంబాన్ని కలుసుకోనున్న Rahul
ABN , First Publish Date - 2022-06-07T01:10:49+05:30 IST
పంజాబ్లో దారుణ హత్యకు గురైన సింగర్, కాంగ్రెస్ నేత సిద్ధు మూసెవాలా(Sidhu Moosewala) కుటుంబాన్ని కాంగ్రెస్(Congress) పార్టీ కీలక నేత రాహుల్ గాంధీ(Rahul Gandhi) కలుసుకోనున్నట్లు సమాచారం. సిద్ధూ హత్యకు గురైనట్లు రాహుల్ ఇండియాలో లేరు..
చండీగఢ్: పంజాబ్లో దారుణ హత్యకు గురైన సింగర్, కాంగ్రెస్ నేత సిద్ధు మూసెవాలా(Sidhu Moosewala) కుటుంబాన్ని కాంగ్రెస్(Congress) పార్టీ కీలక నేత రాహుల్ గాంధీ(Rahul Gandhi) కలుసుకోనున్నట్లు సమాచారం. సిద్ధూ హత్యకు గురైనట్లు రాహుల్ ఇండియాలో లేరు. ఈ ఘటన జరిగిన వారం తర్వాత ఆయన ఇండియాకు తిరిగి వచ్చారు. పంజాబ్ కాంగ్రెస్ అగ్ర నేతలతో కలిసి రాహుల్.. సిద్ధు కుటుంబాన్ని కలుసకుని పార్టీ తరపున సంతాపం వ్యక్తం చేయనున్నారట. మార్చిలో జరిగిన పంజాబ్ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ తరపున మాన్సా నియోజకవర్గం నుంచి మూసెవాలా పోటీ చేసి ఓడిపోయారు. సుభందీప్ సిద్ధూ అయినప్పటికీ సిద్ధూ మూసెవాలాగా ప్రఖ్యాతి పొందిన ఆయన మే 29న మాన్సా జిల్లాలో దారుణ హత్యకు గురయ్యారు. పంజాబ్లోని 424 మంది ప్రభుత్వ భద్రతను తొలగించిన మర్నాడే ఈ హత్య జరగడం రాజకీయంగా తీవ్ర వివాదానికి తెరలేపింది.