రైలులో నుంచి జారిపడి తీవ్ర గాయాలు

ABN , First Publish Date - 2022-10-02T03:52:58+05:30 IST

వెంకటాచలం రైల్వేస్టేషన్‌ వద్ద శనివారం రైలులో నుంచి గుర్తుతెలియని వ్యక్తి జారిపడి తీవ్రంగా గాయపడ్డాడు. రైల్వే సిబ్బంది

రైలులో నుంచి జారిపడి తీవ్ర గాయాలు
తీవ్రంగా గాయపడిన వ్యక్తి

వెంకటాచలం, అక్టోబరు 1 : వెంకటాచలం రైల్వేస్టేషన్‌ వద్ద శనివారం రైలులో నుంచి గుర్తుతెలియని వ్యక్తి జారిపడి తీవ్రంగా గాయపడ్డాడు. రైల్వే సిబ్బంది కథనం మేరకు, సుమారు 45 ఏళ్ల గుర్తుతెలియని వ్యక్తి ప్రయాణిస్తున్న రైలు నుంచి ప్రమాదవశాత్తు జారిపడ్డాడు. దీంతో ఆ వ్యక్తికి తీవ్ర గాయాలయ్యాయి. నడవలేని స్థితిలో ఉన్న ఆ వ్యక్తిని రైల్వే సిబ్బంది చికిత్స నిమిత్తం నెల్లూరు ప్రభుత్వ అసుపత్రికి తరలించారు. 

Updated Date - 2022-10-02T03:52:58+05:30 IST