Railway వంతెన మూసివేతతో అవస్థలు

ABN , First Publish Date - 2022-06-19T13:36:18+05:30 IST

స్థానిక కాట్పాడిలో తమిళనాడు-ఆంధ్ర రాష్ట్రాలను కలిపే రైల్వే వంతెన ఉంది. ఈ వంతెనపై పగుళ్లు ఏర్పడడంతో మరమ్మతుపనులు చేపట్టేందుకు ఈ నెల 1వ

Railway వంతెన మూసివేతతో అవస్థలు

వేలూరు(చెన్నై), జూన్‌ 18: స్థానిక కాట్పాడిలో తమిళనాడు-ఆంధ్ర రాష్ట్రాలను కలిపే రైల్వే వంతెన ఉంది. ఈ వంతెనపై పగుళ్లు ఏర్పడడంతో మరమ్మతుపనులు చేపట్టేందుకు ఈ నెల 1వ తేదీ నుంచి వంతెనపై వాహనాల రాకపోకలను అధికారులు నిషేధించారు. టౌన్‌ బస్సులు కాట్పాడి రైల్వేస్టేషన్‌ వరకు మాత్రమే వెళుతుండగా, ప్రయాణికులు వంతెన సమీపంలోని నడక దారి మార్గంగా శ్రమపడి వెళ్లాల్సి వస్తోంది. అదే సమయంలో వాహనాలను వంతెన సమీపంలోని మార్గంలో అనుమతిస్తుండగా ట్రాఫిక్‌ అధికమై గుంతలమయంగా మారింది. వాహనాలు వెళ్లే ఏర్పడే దుమ్ముతో ప్రజలు అవస్థలు పడుతున్నారు. ఈ మార్గంలో విద్యుద్దీపాలు లేకపోవడం, ఈ మార్గం సమీపంలో టాస్మాక్‌ మద్యం దుకాణముండడంతో రాత్రి వేళల్లో మందు బాబుల ఆగడాలు అధికంగా ఉన్నాయి. ప్రత్యామ్నాయంగా సరైన రోడ్డు ఏర్పాటుచేయకుండా రైల్వే వంతెన మూసివేయడంపై సమాజసేవకులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. వంతెన మరమ్మతు పనులు సత్వరం పూర్తిచేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని వారు విజ్ఞప్తి చేస్తున్నారు.

Updated Date - 2022-06-19T13:36:18+05:30 IST