విజయవాడ రైల్వే కోర్టుకు కాపు నేతలు

ABN , First Publish Date - 2021-03-03T06:14:09+05:30 IST

తుని రైలు దహనం కేసులో కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభంతో పాటు, మరికొందరు కాపు నాయకులు మంగళవారం విజయవాడలో రైల్వే కోర్టుకు హాజరయ్యారు.

విజయవాడ రైల్వే కోర్టుకు కాపు నేతలు
హాజరై.న కాపు నేతలు

కిర్లంపూడి, మార్చి 2: తుని రైలు దహనం కేసులో కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభంతో పాటు, మరికొందరు కాపు నాయకులు మంగళవారం విజయవాడలో రైల్వే కోర్టుకు హాజరయ్యారు. 2016 జనవరి 31న తునిలో రత్నాచల్‌ ఎక్స్‌ప్రెస్‌ దగ్ధమైన విషయం తెలిసిందే. ఈ కేసుకు సంబంధించి పలువురు కాపు నాయకులకు విజయవాడ రైల్వే కోర్టు సమన్లు జారీ చేసి నేరుగా హాజరుకావాలని ఆదేశించింది. దీంతో ముద్రగడతో పాటు పలువురు కాపు నాయకులు 38 మంది కోర్టుకు హాజరయ్యారు. రైల్వే కోర్టు న్యాయమూర్తి కేసును ఈ నెల 16కు వాయిదా వేశారు.  

Updated Date - 2021-03-03T06:14:09+05:30 IST