Chennai: మళ్లీ పట్టాలపై కొండచరియలు

ABN , First Publish Date - 2021-11-16T16:00:25+05:30 IST

ధర్మపురి సమీపంలో ముత్తంపట్టి లో కురిసిన భారీవర్షానికి రైలు పట్టాలపై మళ్లీ కొండచరియలు విరిగిపడ్డాయి. కేరళ నుంచి యశ్వంత్‌పూర్‌కు వెళ్లే ఎక్స్‌ప్రెస్‌ ధర్మపురి జిల్లా తొప్పూర్‌ సమీపంలోని ముత్తంపట్టి కొండ మార్గంగా గత 12వ తేదీ వెళుతున్న

Chennai: మళ్లీ పట్టాలపై కొండచరియలు

ఐసిఎఫ్‌(చెన్నై): ధర్మపురి సమీపంలో ముత్తంపట్టి లో కురిసిన భారీవర్షానికి  రైలు పట్టాలపై మళ్లీ కొండచరియలు విరిగిపడ్డాయి. కేరళ నుంచి యశ్వంత్‌పూర్‌కు వెళ్లే ఎక్స్‌ప్రెస్‌ ధర్మపురి జిల్లా తొప్పూర్‌ సమీపంలోని ముత్తంపట్టి కొండ మార్గంగా గత 12వ తేదీ వెళుతున్న సమయంలో కొండచెరియలు విరిగిపడడంతో ఏడు బోగీలు పట్టాలు తప్పిన విషయం తెలిసిందే. రైల్వే సిబ్బంది రైలు పట్టాలపై పడిన బండరాళ్లను తొలగించడంతో రైళ్ల రాకపోకలు యధావిధిగా సాగాయి. ఈ క్రమంలో, ఆదివారం మళ్లీ కొండచరియలు రైలుపట్టాలపై పడడంతో వాటిని రైల్వే సిబ్బంది తొలగిస్తున్నారు. ఈ కారణంగా ఆ మార్గంలో రైళ్ల రాకపోకల్లో జాప్యం ఏర్పడింది.

Updated Date - 2021-11-16T16:00:25+05:30 IST