TRAIN TRACK FIRE: ఆ నగరంలో ఆకాశానికి చిల్లు.. ఎండలకు రైలు పట్టాలే బొగ్గుబొగ్గు..!
ABN , First Publish Date - 2022-07-13T01:00:04+05:30 IST
లండన్ నగరంలో భానుడు భగ్గుమంటున్నాడు. దీంతో జనాలు ఇళ్ల నుంచి బయటకు రావాలంటేనే భయంతో వణికిపోతున్నారు. గతంలో ఎప్పుడు లేనంతగా ఎండలు ఉండటంతో..
లండన్ నగరంలో భానుడు భగ్గుమంటున్నాడు. దీంతో జనాలు ఇళ్ల నుంచి బయటకు రావాలంటేనే భయంతో వణికిపోతున్నారు. గతంలో ఎప్పుడు లేనంతగా ఎండలు ఉండటంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.. ప్రస్తుతం లండన్ నగరంలో ఎండలకు సంబంధించిన ఓ వార్త సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. లండన్ నగరంలోని ఓ రైల్వే స్టేషన్లో ఎండవేడిమికి ఏకంగా రైలు పట్టాలే కాలిపోయాయని అధికారులు వెల్లడించారు. వాండ్స్ వార్త్ రోడ్, లండన్ విక్టోరియా మధ్య ఈ ఘటన చోటు చేసుకుందని తెలిపారు. ఈ విషయాన్ని సౌత్ ఈస్ట్రన్ రైల్వే ఎండీ స్టీవ్ వైట్ ట్విటర్ ద్వారా ప్రకటించారు.
అయితే సకాలంలో సిబ్బంది స్పందించి మంటలను ఆర్పేసినట్లు ఆయన వెల్లడించారు. ఇక స్టీవ్ ట్వీట్కు.. సిబ్బంది కూడా స్పందించారు. రాబోయే రోజుల్లో ఉష్ణోగ్రతలు సవాల్గా మారనున్నాయని తెలిపారు. పట్టాలపై మరీ పొడి వాతావరణం ఉండడంతో ప్రమాదం జరిగి ఉంటుందని అధికారులు చెబుతున్నారు. యూకేలో 34 డిగ్రీల సెల్సియస్ దాటితే.. ఇలాంటి పరిస్థితులు నెలకొనడం సాధారణమేనని అధికారులు అంటున్నారు.