రైల్వే అండర్ టన్నెల్ నిర్మాణం
ABN , First Publish Date - 2022-05-20T05:49:06+05:30 IST
భీమవరం – తాడేపల్లిగూడెం రహదారిలో విజయలక్ష్మి థియేటర్ సమీపంలో రైల్వే అండర్ టన్నెల్ పనులు చురుగ్గా సాగుతున్నాయి.
భీమవరం క్రైం, మే 19: భీమవరం – తాడేపల్లిగూడెం రహదారిలో విజయలక్ష్మి థియేటర్ సమీపంలో రైల్వే అండర్ టన్నెల్ పనులు చురుగ్గా సాగుతున్నాయి. రైల్వేశాఖ రూ.18 కోట్లతో నిర్మిస్తున్న అండర్ టన్నెల్ పనులు సుమారు నెలరోజుల్లో పూర్తి చేయడానికి రైల్వేశాఖ చర్యలు తీసుకుంది. రైల్వేగేటుతో తలెత్తుతున్న ట్రాఫిక్ సమస్యకు పరిష్కార దిశగా ముందుకు వెళుతున్నారు. గతంలో ఆర్వోబీ నిర్మించాలని ప్రతిపాదనలు చేశారు. ఆర్వోబీ నిర్మాణానికి స్ధల సేకరణ ఇబ్బంది కావడంతో ఆ ప్రతిపాదనలు పక్కన పెట్టారు. ప్రస్తుతం అండర్ టన్నెల్ నిర్మాణ పనులు వేగంగా జరుగుతున్నాయి. ఈ నెల 8న మూసివేసిన రైల్వేగేటు వచ్చే నెల 8 వరకు అలాగే ఉంచి పనులు కొనసాగిస్తారు.