పోలీస్ పహారాలో రైల్వే పనులు
ABN , First Publish Date - 2021-12-05T06:23:01+05:30 IST
మద్దికెర రైల్వే స్టేషన్లో ఫుట్ ఓవర్ బ్రిడ్జి నిర్మాణ పనులు పోలీసు బందోబస్తు మధ్య శనివారం పునఃప్రారంభమ య్యాయి.
మద్దికెర, డిసెంబరు 4: మద్దికెర రైల్వే స్టేషన్లో ఫుట్ ఓవర్ బ్రిడ్జి నిర్మాణ పనులు పోలీసు బందోబస్తు మధ్య శనివారం పునఃప్రారంభమ య్యాయి. కాంట్రాక్టు కంపెనీ మేనేజర్ నందకిశోర్ ఆధ్వర్యంలో పనులు చేపట్టారు. రైల్వే కాంట్రాక్టర్ పర్సంటేజీ ఇవ్వలేదని వైసీపీ వర్గీయులు కొందరు ఈ నెల 1వ తేదీన పని చేసే వారిపై దాడి చేశారు. దీంతో బాధితులు పోలీసులను ఆశ్రయించారు. పోలీసులు పని ప్రదేశంలో రక్షణ కల్పించారు. రైల్వే పనులకు ఆటంకం కలిగిస్తే ఎంతటి వారైనా చర్యలు తప్పవని రైల్వే ఎస్ఐ రామకృష్ణారెడ్డి హెచ్చరించారు.