ఉరుములు, మెరుపులతో వర్షం

ABN , First Publish Date - 2021-04-21T05:33:57+05:30 IST

మండలంలోని గ్రామాల్లో మంగళవారం సాయంత్రం ఉరుములు, మెరుపులతో ఓ మోస్తరు వర్షం కురిసింది.

ఉరుములు, మెరుపులతో వర్షం
తిప్పారెడ్డిపల్లె సమీపంలో వరి ధాన్యానికి పట్టలు కప్పుతున్న రైతులు

రుద్రవరం, ఏప్రిల్‌ 20: మండలంలోని గ్రామాల్లో మంగళవారం సాయంత్రం ఉరుములు, మెరుపులతో ఓ మోస్తరు  వర్షం కురిసింది. మండలంలోని తిప్పారెడ్డిపల్ల్లె, ఆలమూరు, నాగులవరం, నరసాపురం తదితర గ్రామాలకు చెందిన రైతులు వరి ధాన్యం కుప్పలు పోసి పట్టలు కప్పి ఉంచారు. చేతికందిన ధాన్యం ఎక్కడ తడిసి పోతుందోనని రైతులు పరుగులు పెట్టారు. 


ఆళ్లగడ్డ: నియోజకవర్గంలోని గ్రామాల్లో మంగళవారం వీచిన బలమైన గాలులకు విద్యుత్‌ స్తంభాలు విరిగి పడ్డాయి. దీంతో గ్రామాల్లోని ప్రజలు అందకారంలో ఉన్నారు. అలాగే దొర్నిపాడు, ఉయ్యాలవాడ మండలాల్లో తెలికపాటి వర్షం కురిసింది. దీంతో గ్రామాల్లోని రైతులు రబీ సీజన్‌లో సాగు చేసిన పంటల దిగుబడులను కాపాడుకునేందుకు ఇబ్బందులు పడ్డారు. 

Updated Date - 2021-04-21T05:33:57+05:30 IST