తాంసిలో వర్షం.. తడిసిన ధాన్యం

ABN , First Publish Date - 2021-05-11T06:03:27+05:30 IST

మండలంలో సోమవారం మధ్యాహ్నం రెండు గంటల పాటు కురిసిన వర్షానికి చేలల్లో ఉన్న పంటలన్నీ తడిసి ముద్దయ్యాయి.

తాంసిలో వర్షం.. తడిసిన ధాన్యం
తడిసిన ధాన్యాన్ని తరలిస్తున్న రైతులు

తాంసి, మే 10: మండలంలో సోమవారం మధ్యాహ్నం రెండు గంటల పాటు కురిసిన వర్షానికి చేలల్లో ఉన్న పంటలన్నీ తడిసి ముద్దయ్యాయి. పక్షం రోజుల నుంచి వరుసగా వర్షాలు కురుస్తుండడంతో ఈ పాటికే చాలా మంది రైతులకు తీవ్ర నష్టం వాటిల్లింది. మండలంలో సుమారు 4వేల ఎకరాల్లో యాసంగి పంటలను సాగు చేస్తున్నారు. ఈ పాటికే సగం వరకు పంటలు ఇంటికి చేరగా మిగిలిన పంటలు ఇంకా చేనులోనే ఉన్నాయి. ముఖ్యంగా వేరుశనగ, జొన్న, మినుము, పెసర, నువ్వుల పంటలకు నష్టం వాటిల్లింది.

Updated Date - 2021-05-11T06:03:27+05:30 IST