కురిసింది వాన..

ABN , First Publish Date - 2022-06-28T05:52:44+05:30 IST

కురిసింది వాన..

కురిసింది వాన..
బందరులోని ప్రధాన రహదారిపై వర్షపు నీరు

జిల్లావ్యాప్తంగా భారీ వర్షాలు

రైతుల్లో ఉత్సాహం.. రోడ్లన్నీ జలమయం

మచిలీపట్నం టౌన్‌, జూన్‌ 27 : జిల్లాలోని పలు ప్రాంతాల్లో శనివారం రాత్రి, ఆదివారం ఉదయం భారీ వర్షం కురిసింది. చల్లపల్లి మండలంలో 69 మిల్లీమీటర్ల అధిక వర్షపాతం నమోదైంది. మచిలీపట్నంలో 26 మిల్లీమీటర్లు కాగా, జిల్లా మొత్తంమీద 627 మిల్లీమీటర్లుగా వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. కాగా, ఈ వర్షానికి రైతుల్లో ఉత్సాహం వెల్లివిరిసింది. బందరు, గూడూరు, మొవ్వ మండలాల్లోని వివిధ గ్రామాల్లో రైతులు దుక్కి దున్నే కార్యక్రమాన్ని ప్రారంభించారు. కాగా, కపిలేశ్వరపురం పంచాయతీ కార్యాలయం ఎదుట మంటాడ, లంకపల్లి ఆర్‌అండ్‌బీ రోడ్డు చెరువులా మారిపోయింది. వాహనదారులు అనేక ఇబ్బందులు పడ్డారు.


Updated Date - 2022-06-28T05:52:44+05:30 IST