నాలుగో రోజూ వర్షం

ABN , First Publish Date - 2022-10-01T05:37:33+05:30 IST

జిల్లాను ముసురు వదలడం లేదు. నాలుగు రోజులుగా పడుతూనే ఉంది

నాలుగో రోజూ వర్షం
మామిళ్లగూడెం నుంచి విభలాపురం వెళ్లే వాగుపై ప్రవహిస్తున్న వరద

 పొంగిపొర్లుతున్న చెరువులు, కుంటలు

 పలుచోట్ల రాకపోకలకు అంతరాయం

 నీట మునిగిన పంట పొలాలు

(ఆంధ్రజ్యోతి న్యూస్‌నెట్‌వర్క్‌)

జిల్లాను ముసురు వదలడం లేదు. నాలుగు రోజులుగా పడుతూనే ఉంది. శుక్రవారం ఉదయం నుంచి సాయంత్రం వరకూ జిల్లాలోని పలుచోట్ల వర్షం కురిసింది. సూర్యాపేటలో రాత్రి తొమ్మిది గంటల ప్రాంతంలో భారీ వర్షం కురిసింది. మోతె, అర్వపల్లి, తుంగతుర్తి మండలాల్లో చెరువులు అలుగు పోస్తుండటంతో పలు గ్రామాలకు రాకపోకలు నిలిచాయి. మోతె మండలంలో వరి, పత్తి పంటలకు సంబంధించిన 400ఎకరాల్లో నీరు నిలిచింది. చింతలపాలెం మండలం కిష్టాపురం  గ్రామంలో గొర్రెలకాపరి సైదా(37) పిడుగుపాటుకు మృతి చెందాడు. జిల్లాలో అత్యధికంగా తిరుమలగిరి 56.4 మిల్లీమీటర్లు, అత్యల్పంగా అనంతగిరిలో 0.3 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది.  

Updated Date - 2022-10-01T05:37:33+05:30 IST