రైతులు అప్రమత్తంగా ఉండాలి: ఏవో
ABN , First Publish Date - 2021-11-27T06:16:03+05:30 IST
రైతులు అప్రమత్తంగా ఉండాలి: ఏవో
కంచికచర్ల రూరల్, నవంబరు 26: అల్పపీడన ద్రోణితో మరో నాలుగు రోజులు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖాధికారులు చెబుతున్నారని రైతులు అప్రమత్తంగా ఉండాలని ఏవో సురేష్ సూచించారు. వ్యవసాయ శాఖ కార్యాలయంలో శుక్రవారం ఆయన మాట్లాడారు. టార్పాలిన్ పట్టాలను అందుబాటులో ఉంచుకోవాలని, పంట కోసిన రైతులు ఆర్బీకేలోని ధాన్యం కొనుగోలు కేంద్రాలను సంప్రదించాలని సూచించారు. వీఏఏలు రైతులకు అందుబాటులో ఉండాలని ఆదేశించారు.