ఇప్పటికీ ఆ పంటలో నీరు..

ABN , First Publish Date - 2021-01-14T05:13:03+05:30 IST

మండలంలోని నేలంపాడు, గొట్లూరు, జంగాలపల్లె, కొట్టాలపల్లె గ్రామాల సమీపంలో ఉన్న పంట పొలాల్లో నేటికీ వరద నీరు తగ్గలేదు. ఇటీవలి తుఫానులకు ఈ పొలాల్లో నీరు నిలిచిపోయింది.

ఇప్పటికీ  ఆ పంటలో నీరు..
నేలంపాడులో వరి పంటలో నిల్వ ఉన్న నీరు

చాగలమర్రి, జనవరి 13: మండలంలోని నేలంపాడు, గొట్లూరు, జంగాలపల్లె, కొట్టాలపల్లె గ్రామాల సమీపంలో ఉన్న పంట పొలాల్లో నేటికీ  వరద నీరు తగ్గలేదు.  ఇటీవలి తుఫానులకు ఈ పొలాల్లో నీరు నిలిచిపోయింది. వర్షాలు తగ్గిపోయినా ఇప్పటికీ   వరద నీరు పంట పొలాల్లో అలాగే నిలిచి ఉంది. సుమారు 1,500 ఎకరాల్లో  వరద నీరు నిలిచి ఉందని, దీని వల్ల  కోట్లాది రూపాయలు నష్టపోయామని రైతులు అంటున్నారు. దీంతో గ్రామాల్లో సంక్రాంతి పండుగ   కళ తప్పిపోయింది.   అధికారులు స్పందించి పొలాల్లోంచి వరద నీరు మళ్లించేందుకు  చర్యలు తీసుకొని పరిహారం అందించి ఆదుకోవాలని రైతులు కోరుతున్నారు


Updated Date - 2021-01-14T05:13:03+05:30 IST