అకాల వర్షం.. అరటికి నష్టం
ABN , First Publish Date - 2022-05-03T15:06:16+05:30 IST
ఈరోడ్ జిల్లాలో ఆదివారం సాయంత్రం ఈదురుగాలులతో కూడిన భారీవర్షాలకు సుమారు 10 వేలకు పైగా అరటి చెట్లు నేలకొరిగాయి. జిల్లాల్లో కొద్దిరోజులుగా పగటి
పెరంబూర్(చెన్నై): ఈరోడ్ జిల్లాలో ఆదివారం సాయంత్రం ఈదురుగాలులతో కూడిన భారీవర్షాలకు సుమారు 10 వేలకు పైగా అరటి చెట్లు నేలకొరిగాయి. జిల్లాల్లో కొద్దిరోజులుగా పగటి ఉష్ణోగ్రతలు 40 డిగ్రీలకు పైగా నమోదవుతుండడంతో ప్రజలు అల్లాడుతున్నారు. ఈ నేపధ్యంలో, ఆదివారం ఉదయం నుంచి ఎండ తీవ్రత అధికంగా ఉండగా సాయంత్రం 6 గంటలకు ఒక్కసారిగా ఈదురుగాలులతో భారీ వర్షం కురిసింది. జిల్లా అత్యధికంగా పెరుందురైలో 125 మి.మీ వర్షపాతం నమోదైంది. అమ్మాపేట, ఉమారెడ్డియూర్, గోపిచెట్టిపాళయం, చుట్టుపక్కల గ్రామాల్లో ఈదురుగాలులకు సుమారు 10 వేలకు పైగా అరటి చెట్లు నేలకొరగడంతో రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.